తెలుగు లెజెండ్రీ దివంగత నిర్మాత డి రామానాయుడు వారసత్వాన్ని ఉనికి పుచ్చుకునీ చిత్ర పరిశ్రమలో నిర్మాతగా కొనసాగుతున్నాడు డి సురేష్ బాబు. ఇప్పటికే సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ నుంచి ఎన్నో గొప్ప సినిమాలను నిర్మించి మంచి విజయాలు అందుకున్నారు. అంతేకాకుండా ఎందరో కొత్త కొత్త నటులకు అవకాశం ఇస్తూ చిన్నచిన్న సినిమాలను కూడా ఈ బ్యానర్ పై నిర్మించి భారీ విజయాలను కూడా అందుకున్నారు. ఇలాంటి ఈ అగ్ర నిర్మాత పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం మోసం చేశారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వాస్తవానికి 100 కోట్లకు పైగా పారితోషకం అందుకుంటున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆయన నటిస్తున్న ఒక్కొక్క సినిమాకు ఏకంగా రూ.కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. పాన్ ఇండియా లెవెల్ లో ఈ స్థాయిలో పారితోషికం అందుకుంటున్న అతి తక్కువ హీరోల్లో పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ కి కొంతమంది నిర్మాతలు డబ్బులు ఇస్తామని ఇవ్వకుండా రెండు మూడు కోట్లు వరకు పారితోషకం ఎగ్గొట్టిన వాళ్లు చాలామంది ఉన్నారు.
మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి భక్తుడుగా చెప్పుకునే బండ్ల గణేష్, బివిఎస్ ప్రసాద్ వంటి వారు కూడా ఈ లిస్టులో ఉన్నట్టు తెలుస్తుంది. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్- వెంకటేష్ కలిసి నటించినన గోపాల గోపాల సినిమాలో పవన్ కృష్ణుడు పాత్రలో నటించాడు. ఈ సినిమా కోసం పవర్ స్టార్ 15 రోజులు కాల్ షీట్స్ ఇవ్వగా ఆ డేట్స్ కూడా సరిపోక నిర్మాత సురేష్ బాబు మరికొన్ని కాల్ షీట్స్ కావాలని కోరారట.
వాటికన్న ముందే కమిట్ అయిన పారతోషకం కంటే ఎక్కువ ఇవ్వాలని అగ్రిమెంట్లో ఉండటంతో సురేష్ బాబు మొదట ఒప్పుకున్న… ఆ తర్వాత బడ్జెట్ పెరిగిపోయిందని పారితోషకం ఇచ్చుకోలేనని సురేష్ బాబు పవన్ కళ్యాణ్ తో గొడవ పడ్డారట. చివరకు పవన్ కళ్యాణ్ – సురేష్ బాబు మాటలకు ఒప్పుకుని తను ఇచ్చినంత తీసుకొని ఆ తర్వాత సురేష్ బాబు తో మాట్లాడటం మానేశాడట.