బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్గా తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న ఆదిపురుష్ సినిమా ఈనెల 16న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. ఇక పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాపై కనివినీ ఎరుగని రీతిలో అంచనాలు ఉన్నాయి. సాహో – రాధేశ్యామ్ లాంటి రెండు ప్లాప్ సినిమాల తర్వాత ప్రభాస్ రెండు సంవత్సరాల లాంగ్ గ్యాప్ తీసుకుని ఆదిపురుష్ సినిమాలో నటిస్తున్నాడు.
తానాజీ సినిమా దర్శకుడు ఓం రత్ రామాయణ ఇతిహాసాన్ని ఆధారంగా చేసుకొని ఈ సినిమా రూపొందించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు నార్త్ లో ఎప్పుడు ఏదో ఒక నెగిటివ్ ప్రచారం జరుగుతూ ఉంది. టీజర్ రిలీజ్ అయ్యాక అందులో పాత్రల తీరుతెన్నులు తప్పుపడుతూ చాలా ట్రోలింగ్ జరిగింది. ఆ తర్వాత సినిమా యూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకొని ట్రైలర్ వదిలింది. అంతకు ముందు కూడా సీత పాత్రకి కృతి సనన్ను అసలు ఎందుకు ? తీసుకున్నారు అంటూ పెద్ద రచ్చ జరిగింది.
సీతగా కృతిసనన్ ఏమాత్రం సెట్ కాలేదని విమర్శలు చేశారు. ఇక ట్రైలర్లో కృతిసనన్ ఎక్స్ప్రెషన్లు చూశాక అంతా కూల్ అయ్యారు. ఇక ఇప్పుడు ఆదిపురుష్ సినిమా చూసేందుకు దళితులకు ప్రవేశం లేదంటూ ఒక ఫేక్ న్యూస్ బయటకు వచ్చింది. పైగా ఇది పోస్టర్ ద్వారా చెప్పినట్టు కూడా సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరిగింది. రామాయణ పారాయణం జరిగే చోట పవిత్రంగా ఉండాలనేది మా నమ్మకం.. ప్రభాస్ రాముడు గా నటించిన ఆదిపురుష్ సినిమా ప్రదర్శించే థియేటర్లలో దళితులకు ప్రవేశం లేదని అందులో ఉంది.
హిందూ ధర్మం కోసం నిర్మించిన ఈ సినిమాని హిందువులు అందరూ తప్పకుండా వీక్షించాలి అంటూ ఈ పోస్టర్లో ఉంది. దీనిపై దళిత సంఘాలు భగ్గుమన్నాయి.. ఈ సినిమాను అడ్డుకుంటామంటూ వాళ్లు పెద్ద రచ్చ చేస్తున్నారు. దీంతో సినిమా యూనిట్ రంగంలోకి దిగి క్లారిటీ ఇచ్చింది. ఇది ఒక ఫేక్ న్యూస్ అని.. ఇలాంటి వాటిని నమ్మొద్దు.. ఆదిపురుష్ సినిమా కుల, వర్ణ, మతం ఆధారంగా వివక్షను చూపకుండా సమానత్వం కోసం గట్టిగా నిలబడుతుంది.. ఆదిపురుష్ ప్రతి భారతీయుడిది.. ప్రతి చెడుపై మంచి గెలుస్తుంది అంటూ క్లారిటీ ఇచ్చింది.
అయితే ఆదిపురుష్ సినిమాని టార్గెట్ చేస్తూ ఇలాంటి దుష్ప్రచారం ఎవరు ? ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. అయితే ఈ ప్రచారం అంతా నార్త్ ఇండియా నుంచి జరుగుతూ ఉంది.