‘ ఆ నలుగురు ‘ లాంటి క్లాసిక్ హిట్‌ వదులుకున్న టాలీవుడ్‌ స్టార్ హీరో…!

తెలుగులో నట కిరీటగా గుర్తింపు తెచ్చుకున్న రాజేంద్రప్రసాద్ ఆయన కెరీర్లో ఎన్నో గొప్ప సినిమాల్లో నటించారు. ఆయన నటించిన సినిమాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాలలో ఆ నలుగురు ముందు వరుసలో ఉంటుంది. చంద్ర సిద్ధార్థ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ ఆమని జంటగా నటించగా.. కోటా శ్రీనివాసరావు, శుభలేఖ సుధాకర్ వంటీ అగ్ర‌ నటులు ఈ సినిమాలో కీలకపాత్రల‌లో నటించారు.

Aa Naluguru Classic Telugu movie of 2004

ఈ సినిమాను ప్రేమ్ మూవీస్ బ్యాన‌ర్‌పై సరిత పట్రా నిర్మించ‌గా… మద‌న్ కథ‌ అందించారు. ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించిన ఈ సినిమా.. ఆ రోజుల్లో కోటి రూపాయలతో తెరకెక్కింది. 2004 డిసెంబర్‌లో ప్రేక్షకుల‌ ముందుకు వచ్చిన ఈ సినిమాను పెద్దగా ప్రమోషన్స్ లేక తొలి రోజు థియేటర్లు మొత్తం దాదాపు ఖాళీగానేన్నాయి. విడుదలైన రెండు వారాల దాకా ఈ సినిమాపై ప్రేక్షకులు కన్నెత్తి చూడలేదు.

Flash Back: Krishna's Rebellion on That Hero! | cinejosh.com

ఆ తర్వాత సినిమాకు టాక్ బాగా రావడంతో ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు పెట్టడం ప్రారంభించారు. ఈ సినిమా కమర్షియల్ గా కూడా మంచి విజయం సాధించింది. విమర్శకుల దగ్గర నుంచి కూడా ఆ నలుగురు మూవీకి మంచి ప్రశంసలే దక్కాయి. ప్రధానంగా రాజేంద్రప్రసాద్ ఈ సినిమాని వన్ మాన్ షో తో నడిపించారు. తనదైన విలక్షణ నటనతో హావ‌భావాల‌తో అందరినీ ఆకట్టుకున్నారు.

Aa Naluguru - Alchetron, The Free Social Encyclopedia

ఇక దీంతో ఈ సినిమా ప్రేక్షకుల మనసు ఎంతగానో గెలుచుకుంది. ప్రధానంగా ఈ మూవీ క్లైమాక్స్ అందరి చేత కన్నీళ్లు పెట్టిస్తుంది. అయితే ఈ సినిమాలో ముందుగా హీరోగా మరో నటుడిని అనుకున్నారట. ఇక ఆ నటుడు మరెవరో కాదు సూపర్ స్టార్ కృష్ణ.. దర్శకుడు ముందుగా ఈ సినిమా కథను కృష్ణకు చెప్పగా ఎంతగానో నచ్చి చేయాలనుకున్న ఆయన వయసు రిత్యా ఫుల్ లెంగ్త్ రోల్‌లో నటించే శక్తిలేదని చెప్పారట.

Aa Naluguru | Cinema Chaat

ఇక దాంతో ఈ సినిమా రాజేంద్రప్రసాద్ వద్దకు వచ్చింది అలాగే ఈ మూవీలో హీరోయిన్ కోసం చాలామందిని సంప్రదించక వారిలో లక్ష్మీ, గౌతమి, భానుప్రియ, రోజా, సుహాసిని ఇలా ఎంతోమంది హీరోయిన్లు సంప్రదించగా వారందరూ నో చెప్పడంతో చివరగా రాజేంద్రప్రసాద్ సలహా మేరకు ఆమనీని ఓకే చేశారట. ఈ సినిమా రాజేంద్రప్రసాద్ కెరీర్ లోనే ఓ మైల్ స్టోన్‌ సినిమాగా నిలిచింది.