సౌందర్య పరిచయం అక్కర్లేని పేరు. అభినవ సావిత్రి అనే బిరుదు సొంతం చేసుకున్న మహానటి ఈమె. ఈ తరం ప్రేక్షకులకు సావిత్రి అంటే ఎలా ? ఉంటుందో సినిమాల్లో మాత్రమే చూసారు. కానీ నటన పరంగా చూసుకుంటే ఆ సావిత్రి అచ్చంగా ఇలాగే ఉండేదేమో అనేంతగా సౌందర్య అందర్నీ మాయ చేసారు. కానీ దురదృష్టవశాత్తు హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసింది ఈమె. సౌందర్య మరణించి దాదాపు 20 ఏళ్లవుతున్నా కూడా ఇప్పటికీ ఈమెను మరిచిపోలేకపోతున్నాం.
సౌందర్య మరణించే సమయనికి కేవలం ఆమె వయపసు 31 సంవత్సరాలు మాత్రమే.. పైగా పెళ్లై ఏడాది కూడా కాకముందే ఆమె మరణించడం నిజంగానే విషాదం. 100కు పైగా సినిమాల్లో నటించిన సౌందర్యకు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో అభిమానులున్నారు. పేరుకు కన్నడ కస్తూరి అయినా కూడా తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది. అప్పట్లోనే స్టార్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ అందుకుంది.
ఇక సౌందర్య సినిమాల విషయానికి వస్తే మనవరాలి పెళ్లితో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ తర్వాత అమ్మోరు సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. కెరీర్ కొత్తలోనే పెదరాయుడు, ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో సౌందర్య రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎక్స్పోజింగ్కు దూరంగా ఉంటూ నెంబర్ వన్ హీరోయిన్గా చనిపోయే వరకు కూడా కొనసాగింది. కెరీర్ చివర్లో కూడా సంచలన సినిమాలు చేసింది.
ఈ క్రమంలోనే కృష్ణవంశీ దర్శకత్వంలో సౌందర్య ప్రధాన పాత్రలో వచ్చిన అంతపురం సినిమా షూటింగ్ సమయంలో సౌందర్య పలు సినిమాల్లో బిజీగా ఉండటంతో ఈ సినిమా షూటింగ్ ఓ యాక్షన్ సన్నివేశానికి ఈమె రాలేకపోయింది. అదే సమయంలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూనే యాంకర్ గా చేస్తున్న జోగి నాయుడు కృష్ణవంశీ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నాడు.
అలా అంతపురం సినిమాలో ఒక సీన్లు కూడా అతను నటించాడు. ఇక అప్పుడు కృష్ణవంశీ సౌందర్యకు డూప్ గా జోగి నాయుడు పెట్టి ఆ యాక్షన్ సన్నివేశాన్ని తెరకెక్కించారు. ఇలా అంతపురం సినిమాలో సౌందర్య కి డూప్ గా నటించిన ఏకైక వ్యక్తిగా జోగినాయుడు మిగిలిపోయాడు. ఇక జోగినాయుడు యాంకర్ ఝాన్సీ మాజీ భర్త అన్న విషయం తెలిసిందే.