బాల‌య్య భ‌గ‌వంత్ కేస‌రిలో మూడో హీరోయిన్ కూడా….!

నట‌సింహ నందమూరి బాలకృష్ణ ఈ ఏడాది సంక్రాంతికి వీరసింహారెడ్డి సినిమాతో సూపర్ హిట్ కొట్టారు. అఖండ తర్వాత బాలయ్య వరుసగా రెండో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనూ ఇప్పుడు బాలయ్య నుంచి వస్తున్న సినిమా భగవంత్‌ కేసరి టాలీవుడ్ లో అపజయం అన్నది లేకుండా వరుస సూపర్ డూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకుడు.

సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ బాలయ్యకు జోడిగా నటిస్తుండగా యంగ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లు ఉండగా తాజా సమాచారం ప్రకారం మూడో హీరోయిన్ కూడా వచ్చి చేరినట్టు తెలుస్తోంది. ఆ మూడో హీరోయిన్ ఎవరో కాదు జువ్వ, అబ్బాయితో అమ్మాయి లాంటి సినిమాలలో నటించిన ప‌ల్ల‌క్ ల‌ల్వానిని ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.

ఈ పాత్రలో నటించేందుకు ఆమె ఇప్పటికే అంగీకరించినట్టు సమాచారం. అయితే ఆమె పాత్ర ఎలా ?ఉండబోతుంది అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమాలో ఇప్పటికే కాజల్, శ్రీలీల‌ నటిస్తుండగా ఇప్పుడు మూడో హీరోయిన్గా ప‌ల్ల‌క్ కూడా వచ్చి చేరడంతో సినిమాకు మరింత గ్లామర్ యాడ్ అయినట్టు అయింది. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ గా నటిస్తుండగా… తమన్ సంగీతం అందిస్తున్నారు.

షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది ఈ సినిమాని భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాని దసరా పండుగ కానుక‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఏదేమైనా టైటిల్‌, టీజ‌ర్‌తోనే ఒక్క‌సారిగా స్కై రేంజ్ అంచ‌నాలు ట‌చ్ చేసిన భగవంత్ కేసరి రిలీజ్ అనంతరం ఏ రేంజ్‌లో ఉంటుందో ? చూడాలి.