టాలీవుడ్ లో గత కొంతకాలంగా హీరోలు, హీరోయిన్లు ఒక్కొక్కరు బ్యాచిలర్ లైఫ్కు ఫులిస్టాప్ పెట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో ఇప్పుడు కొన్ని పెళ్లిళ్లు హాట్ హాట్ గా మారుతున్నాయి. ఒకటి రెండు నెలల్లో ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు హీరోలు, ముగ్గురు హీరోయిన్లు పెళ్లి చేసుకోబోతున్నారు. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్గా శర్వానంద్ తన ప్రియురాలు రక్షిత రెడ్డితో మూడు ముళ్ళు వేసి ఏడడుగులు నడిచాడు.
దీంతో శర్వానంద్ వైవాహిక జీవితం ప్రారంభమైంది. నిన్నటి వరకు ఇదే హాట్ టాపిక్ గా నిలిచింది. ఇప్పటికి ఇప్పుడు మరో ముగ్గురు హీరోలు, ముగ్గురు హీరోయిన్లను ప్రేమించి వారిని పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ముందుగా మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి ప్రేమాయణం క్లైమాక్స్ కు వచ్చేసిందని.. ఈ నెలలోనే మీరు ఎంగేజ్మెంట్ జరుగుతుందని.. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని ఒకటే ప్రచారం జరుగుతుంది.
మెగాఫ్యామిలీ కూడా వీరి పెళ్లికి దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇక టాలీవుడ్ లో మోస్ట్ హ్యాండ్సమ్ ఎలిజబుల్ బ్యాచిలర్ హీరోలలో అడవి శేషు కూడా ఒకరు. వరుస హిట్లతో దూసుకుపోతున్న అడవి శేష్ నాగార్జున మేనకోడలు నటి యార్లగడ్డ సుప్రియతో కొంతకాలంగా ప్రేమలోనూ.. డేటింగ్ లోను ఉన్నాడని రూమర్లు వినిపిస్తున్నాయి. ఈనెల 16న వీరిద్దరూ పెళ్లి బంధంతో ఏకం కాబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
అయితే దీనిపై అక్కినేని ఫ్యామిలీ నుంచి.. ఇటు అడవి శేషు నుంచి అయితే అధికారిక ప్రకటన రాలేదు.
ఈ ఇద్దరు హీరోలు, హీరోయిన్లు మాత్రమే కాకుండా మరో యంగ్ హీరో, హీరోయిన్ కూడా ప్రేమలో ఉన్నారని వీరిద్దరు కూడా పెళ్లి బంధంతో వైవాహిక జీవితాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నట్టు ఇండస్ట్రీ వర్గాలు ఒకటే గుసగుసలాడుకుంటున్నాయి. ఆ హీరో, హీరోయిన్ ఎవరన్నది ఈ నెలలోనే క్లారిటీ వచ్చేలా ఉంది. ఏది ఏమైనా ఇప్పుడు టాలీవుడ్ లో ఒక్కటే పెళ్లిళ్ల కళ కనిపిస్తోంది.