పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కలయికలో ఓ మల్టీస్టారర్ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ నటుడు సముద్రఖని తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ షూటింగ్ పార్ట్ కూడా ఇప్పటికే పూర్తయ్యింది. ఇక జూలైలో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటించేశారు కూడా..!
మేనమామ, మేనళ్లుడు కలిసి తొలిసారిగా నటిస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను జీ స్టూడియోస్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కేతిక శర్మ, బ్రహ్మానందం, తణికెళ్ల భరణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమా తమిళ హిట్ వినోదయ సితంకి రీమేక్ గా తెరకెక్కుతోంది. ఆకట్టుకునే కథ, కథనాలతో రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్టులో పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాకు బ్రో అనే టైటిల్ పెట్టాలని యూనిట్ డిసైడ్ అయ్యారట.
ఇప్పటికే పలు టైటిల్స్ పరిశీలించిన యూనిట్ ఫైనల్ గా బ్రో టైటిల్ ఫిక్స్ చేశారని టాలీవుడ్ లేటెస్ట్ టాక్. జూలై 28న వరల్డ్ వైడ్గా ఈ సినిమాను గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.