సినిమా ఇండస్ట్రీలో ఒక్కోసారి ఆలోచన లేకుండా చేసే తప్పులు ఎలాంటి వ్యక్తిని అయినా అందరికీ టార్గెట్ అయ్యేలా చేస్తాయి. ఇప్పుడు యంగ్ డైరెక్టర్ పరుశురామ్ కూడా టాలీవుడ్ లో స్టార్ హీరోలకు అగ్ర నిర్మాతలకు టార్గెట్ అయిపోయాడు. పరుశురామ్ సర్కార్ వారి పాట సినిమా కథ మహేష్ కు చెప్పినప్పుడు ఒకలా ఉందని తీరా సినిమా తీశాక మరోలా ఉందని మహేష్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడని వార్తలు వచ్చాయి. అసలు పరుశురామ్ లాంటి డైరెక్టర్కు మహేష్ బాబు లాంటి స్టార్ హీరోను డైరెక్ట్ చేసే ఛాన్స్ రావటం చాలా గ్రేట్ ..అయితే అంది వచ్చిన అవకాశాన్ని పరుశురామ్ చేజేతుల కాల దన్నుకున్నాడు సర్కార్ వారి పాట సినిమా అంచనాలు అందుకోలేకపోయింది. సెకండాఫ్ అయితే మహేష్ ఇమేజ్కు తగ్గట్టుగా లేదన్న విమర్శలు కూడా వచ్చాయి.
చివరకు సర్కార్ వారి పాట కొన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ కూడా కాలేదు. దీంతో మహేష్ పరశురామ్పై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అలా స్టార్ హీరోకు టార్గెట్ అయిన పరుశురామ్ ఇప్పుడు మరో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ కు కూడా బాగా టార్గెట్ అయ్యాడు. వాస్తవానికి గీత ఆర్ట్స్ బ్యానర్ లో మరో సినిమా చేసేందుకు పరుశురామ్కు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. అయితే పరశురామ్ దిల్ రాజు బ్యానర్ లో విజయ్ దేవరకొండ హీరోగా సినిమా చేసే ఛాన్స్ వచ్చిందని అల్లు అరవింద్ సినిమాను పక్కన పెట్టేసి మరి దిల్ రాజ్ కాంపౌండ్ లోకి దూకేశాడు.
దీనిపై అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టి మరి పరశురామ్పై విమర్శలు చేయాలని అనుకున్నారు. అయితే ఇండస్ట్రీ పెద్దలు ఆయనపై ఒత్తిడి తేవడంతో ఆగిపోయారు. తాజాగా 2018 సినిమా సక్సెస్ మీట్ లో మాట్లాడిన ఆయన కార్తికేయ2 డైరెక్టర్ చందు మొండేటిపై ప్రశంసల వర్షం కురిపించారు.. తన బ్యానర్ లో రెండు సినిమాలు చేసేందుకు చందును తాను బుక్ చేసుకున్నాను అని చందు ఎప్పుడు గీత దాటలేదని అయితే తన ద్వారా పైకి వచ్చిన కొందరు దర్శకులు టెంప్టింగ్ ఆఫర్ రావడంతో తనకు ఇచ్చిన మాట కాదని గీత దాటి వెళ్ళిపోయారంటూ పరోక్షంగా పరశురామ్ను ఉద్దేశించి విమర్శలు చేశారు.
ఏది ఏమైనా మంచి డైరెక్టర్గా భవిష్యత్తు ఉన్న పరుశురామ్ ఇలా ఇండస్ట్రీలో హీరోలు నిర్మాతలకు టార్గెట్ అయితే అది కచ్చితంగా భవిష్యత్తు అవకాశాలపై ప్రభావం చూపుతోందని పలువురు అంటున్నారు మరి పరుశురామ్ తన తీరు మార్చుకుని ముందుకు వెళ్తాడో లేదో..? చూడాలి..!!