నటసింహం బాలకృష్ణ సినిమాలో అవకాశం వస్తే వదులుకోవడానికి ఏ హీరోయిన్ ఇష్టపడరు. బాలయ్యకు జోడిగా నటించే ఛాన్స్ అంటే ఏ హీరోయిన్ అయినా వెంటనే ఓకే చెబుతారు. నయనతార లాంటి లేడీ సూపర్ స్టార్ ఇప్పుడు సౌత్ ఇండియాలో చాలామంది హీరోల పక్కన నటించేందుకు ఇష్టపడటం లేదు. అయితే బాలయ్య సినిమాలో ఛాన్స్ వస్తే మాత్రం నయనతార వెంటనే ఓకే చెబుతుంది. బాలయ్యకు జోడిగా సింహ, శ్రీరామరాజ్యం, జై సింహా వంటి సూపర్ హిట్ సినిమాల్లో నయనతార నటించింది.
ముఖ్యంగా సీనియర్ హీరోయిన్లు బాలయ్య పక్కన నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. బాలయ్యతో ఒక్క సినిమా చేస్తే తమ కెరీర్ టర్న్ అవుతుందని ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నారు. అయితే ఒక హీరోయిన్ మాత్రం బాలయ్య సినిమాలో నటించడానికి నో చెప్పిందట. మరి దానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. బాలయ్య- వినాయక్ కాంబోలో వచ్చిన చెన్నకేశవరెడ్డి సినిమాలో బాలయ్యకు జంటగా టబు, శ్రియా నటించారు.
ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశాడు. అయితే ఈ సినిమాలో బాలయ్యకు జంటగా ముందుగా టబు ప్లేస్ లో స్టార్ హీరోయిన్ సౌందర్యని అనుకున్నారట. ఇదే విషయన్ని సౌందర్యకు చెప్పడంతో ఆమె నో చెప్పిందట. దానికి ముఖ్య కారణం బాలకృష్ణ సినిమాలో ద్విపాత్రభినయం చేసినప్పుడు బాలయ్య తండ్రి పాత్రకు సౌందర్యని హీరోయిన్గా అనుకున్నారట. కానీ సౌందర్య ఆ పాత్రకు నో చెప్పిందట. ఎందుకంటే ఆమె ఆ సమయానికి సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది.
ఆ సమయంలో బాలకృష్ణకు తల్లి పాత్రలో సౌందర్య నటించాల్సి వస్తే తన సినీ కెరీర్ పై ప్రభావం పడుతుందని ఆమె ఆ ఉద్దేశంతో ఆ సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదట. ఆ తర్వాత ఆ పాత్రకి హీరోయిన్ టబుని తీసుకున్నారు. చిన్న బాలయ్యకు శ్రియాని హీరోయిన్గా తీసుకున్నారు. సినిమా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది.