మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె తన భర్త జొన్నలగడ్డ చైతన్యకు మధ్య గ్యాప్ పెరిగిపోయిందని వీరిద్దరూ వేరువేరుగా ఉంటున్నారని త్వరలోనే విడాకులు కూడా తీసుకోబోతున్నారంటూ గత వారం రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. చైతు తన సోషల్ మీడియా అకౌంట్లో నుంచి నిహారికతో దిగిన అన్ని ఫోటోలు డిలీట్ చేసేసాడు. ఇటు మెగా ఫ్యామిలీ ఫంక్షన్లలోనూ.. మెగా ఫ్యామిలీ ఫోటోలలో కూడా ఎక్కడ కనపడటం లేదు.
అటు నిహారిక కూడా గత కొద్ది నెలలుగా తన భర్త చైతన్యతో దిగిన ఫోటోలు షేర్ చేయడం లేదు. దీంతో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తారాస్థాయికి చేరుకున్నాయని అంటున్నారు. ఇక పెళ్లికి ముందు నిహారిక యాంకర్ గా, సినిమాలలో హీరోయిన్గా, అటు వెబ్ సిరీస్ లలో కూడా నటించింది. ఆమె మంచి పాత్రలే ఎంచుకున్నా అనుకున్న ఫలితాలు అయితే రాలేదు.
నాగశౌర్య లాంటి హీరోలకు ఆమె జోడిగా నటించింది. అయితే స్టార్ డైరెక్టర్లు, స్టార్ హీరోల సినిమాలలో ఆమెకు ఛాన్స్ రాకపోవడం కెరీర్ పరంగా మైనస్ అయింది. అయితే ఉగాది పండుగ నిహారికకు కలిసి రావటం లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గత ఏడాది ఉగాది సమయంలో ఆమె బంజారా హిల్స్లో ఓ పబ్లో ఉండగా దాడులు జరిగాయి. పోలీసులు వస్తున్న సమయంలో నిహారిక అక్కడ నుంచి వెళ్లిపోవడంతో పెద్ద ఎత్తున నిహారిక కేంద్రంగా ట్రోలింగ్ జరిగింది. ఆమెపై చాలా విమర్శలకు వచ్చాయి.
ఇక ఈ యేడాది ఉగాది సమయంలో నిహారిక ఆమె భర్తతో విడిపోతున్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. గత రెండు నెలలుగా నిహారిక భర్తకు పూర్తి దూరంగా ఉంటుందని.. సొంత బ్యానర్ లో పలు వెబ్సీరీస్ లు నిర్మిస్తూ సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తుందని తెలుస్తోంది. ఏదేమైనా నిహారిక పెళ్లయిన రెండేళ్ళకే ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం.. ఆమె వైవాహిక బంధం గురించి ఇలా వార్తలు రావడం బాధాకరం.