ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే.. ఎలాంటి ఫలితం వస్తుంది? ఏ పార్టీకి ప్రజలు మొగ్గు చూపుతారు? అనేది ఆసక్తిగా మారింది. ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ కూడా నడుస్తుండడం గమనార్హం. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలతో టీడీపీలో జోష్ కనిపిస్తోంది. అయితే.. అదే సమయంలో స్థానిక సంస్థలు, ఉపాధ్యాయ వర్గాల కోటాలో వైసీపీ కూడా విజయం దక్కించుకుంది.
కాబట్టి..గ్రాడ్యుయేట్ల ఓట్లు టీడీపీకి పడినా.. వైసీపీ కూడా ఉపాధ్యాయ వర్గాల్లో తొలిసారి విజయం దక్కించు కుంది. ఈ నేపథ్యంలో రెండు పార్టీలు కూడా ఒకరకంగా సమ ఉజ్జీతోనే ఉన్నాయని అంటున్నారు పరిశీల కులు. అయినప్పటికీ.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు పెరిగిన వాతావరణం స్పష్టంగా కనిపించిందని చెబుతున్నా రు. ఇలాంటి సమయంలో సార్వత్రిక ఎన్నికలు వస్తే.. తమకు లాబిస్తుందని టీడీపీ అంచనా.
టీడీపీ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాల్లో భారీ మెజార్టీలతో గెలిస్తే.. వైసీపీ ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో చావుతప్పి కన్నులొట్టబోయినట్టుగా గెలిచింది. కానీ, ఇదేసమయంలో వైసీపీ లెక్కలు వైసీపీకి ఉన్నాయి. ఆ పార్టీ నాయకులు కూడా కొన్ని అంచనాలు వేస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా తమకు చేకూరే నష్టం అంటూ పెద్దగా లేదని చెబుతు న్నారు. అయితే.. అనుకున్న విధంగా వైనాట్ 175 దక్కించుకోలేకపోయినా.. తమకు ఇబ్బంది అయితే.. రాదని చెబుతున్నారు.
నిజానికి గ్రాడ్యుయేట్ ఫలితాలతో టీడీపీ అటు ఉత్తరాంధ్ర, ఇటు పశ్చిమ, తూర్పు రాయలసీమల్లో పుంజుకుంది. ఈ పరిణామం టీడీపీకి లబ్ధి చేకూరుస్తుందని.. కాబట్టి ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే.. తమకు తిరుగులేదని టీడీపీ నేతలు అంచనాలు వేస్తున్నారు. అయితే ఈ అంచనాలు ఎలా ఉన్నా వచ్చే ఎన్నికల నాటికి.. మాత్రం పార్టీ పుంజుకుంటుందని అధికారంలోకి కూడా వస్తుందని చెబుతున్నారు.