గత సాధారణ ఎన్నికలలో వైసిపి అప్రతిహత విజయం సాధించినప్పటి నుంచి ఆ పార్టీ నేతలు చంద్రబాబును, టిడిపిని 23 నెంబర్ చెబుతూ ఎద్దేవా చేయటం పరిపాటిగా మారింది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆయన పాలనకు ఆకర్షితులు అయ్యి వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు అధికార టిడిపిలో చేరారు. ఏ 23 మంది ఎమ్మెల్యేలను తమ పార్టీ నుంచి చంద్రబాబు లాక్కున్నారో ?చివరకు ఆయన అదే 23 స్థానాలకు పరిమితం అయిపోయారని.. ఇదంతా దేవుడు రాసిన రాత అంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డితో పాటు అధికార పార్టీ నేతలు ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూ ఉంటారు.
అయితే దేవుడు అదే 23 నెంబర్తో ఈరోజు జగన్ మోహన్ రెడ్డి కి పెద్ద షాక్ ఇచ్చిన పరిస్థితి. చంద్రబాబు పతనం 23 నుంచి మొదలైందని.. జగన్ వైసీపీ నేతలు విమర్శలు చేస్తుంటే ఇప్పుడు అదే జగన్కు, వైసిపి నేతలకు 23 సాక్షిగా ఈ రోజు రెండు అదిరిపోయే షాక్ లు తగిలాయి. ఈరోజు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో కేవలం 19 ఓట్ల బలం ఉన్న టిడిపి 23 ఓట్లు సాధించి ఎమ్మెల్సీ స్థానం కైవసం చేసుకుంది. టిడిపి నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన పంచుమర్తి అనురాధకు 23 ఓట్లు వచ్చాయి.
వైసిపి నుంచి ఎమ్మెల్సీలుగా గెలిచిన ఎవరికి 23 ఓట్లు రాలేదు. మొత్తం ఈరోజు గెలిచిన ఎమ్మెల్సీ అభ్యర్థులు అందరిలోనూ అనురాధకే ఎక్కువగా 23 ఓట్లు వచ్చాయి. ఇక ఈ రోజు మరో విశేషం ఏంటంటే 23వ తేదీ కావటం. గత సాధారణ ఎన్నికల్లో జగన్ గెలిచినప్పుడు కూడా మే 23వ తేదీ. ఇప్పుడు అదే తేదీతో చంద్రబాబు జగన్కు రివర్స్ షాక్ ఇచ్చినట్లయ్యింది.
అలా 23 నుంచి మొదలుపెట్టిన చంద్రబాబు.. అదే 23వ తేదీన వైసిపి ఎమ్మెల్సీ అభ్యర్థుల కంటే ఎక్కువగా 23 ఓట్లు సాధించి.. తమ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకున్నారు. దీంతో ఇప్పుడు టిడిపి నేతలు సోషల్ మీడియా వేదికగా వైసీపీ నేతలను 23 నెంబర్ పేరు చెప్పి ఓ ఆటాడుకుంటున్నారు. మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి పతనం కూడా అదే 23 నుంచి మొదలు పెట్టామని చెబుతున్నారు.