వైసీపీ నుంచి సస్పెన్షన్కు గురైన గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఈ రోజు ప్రెస్మీట్ పెట్టి వైసీపీ అధిష్టానం, జగన్తో పాటు సజ్జల రామకృష్ణా రెడ్డిలను ఏకిపడేశారు. అసలు ఏపీలో మహిళల ప్రాణాలకే రక్షణ లేదని.. ఈ పాలనలో రేప్లు ఎందుకు జరగవని ఆమె ప్రశ్నిచారు. పార్టీ పెద్దలు తనను ఘోరంగా అవమానించారని.. తానేమన్నా కాల్ గర్ల్ టైపా అని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేవలం ఒక దళిత మహిళా ఎమ్మెల్యేను అవ్వడం వల్లే తనను ఇన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె ఫైర్ అయ్యారు. ఇక పార్టీ నుంచి బయటకు పంపిన నలుగురు ఎమ్మెల్యేల్లో మిగిలిన ముగ్గురు ఆఫీస్లపై ఎలాంటి ఎటాక్ చేయకుండా కేవలం వైసీపీ గుండాలు తన ఆఫీస్పైకి మాత్రమే ఎందుకు వచ్చారని.. తాను దళిత ఎమ్మెల్యే అవ్వడం వల్లే తనను టార్గెగ్ చేశారని కూడా ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక శ్రీదేవి కుమార్తె కూడా మీడియాతో మాట్లాడారు. తన తల్లి కేవలం దళిత మహిళా ఎమ్మెల్యే అయినందునే ఇలా ఆరోపణలు చేస్తున్నారని.. తమ తల్లిని దూషిస్తూ, చంపేస్తామని బెదిరింపులకు దిగుతున్నారని… నిన్న ఆనం రామనారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ మా జోలికి వస్తే మేం ఊరుకోం.. మేం నెల్లూరు పెద్దారెడ్లం… ఉరికిస్తూ తంతాం అన్నారు.. కేవలం దళిత ఎమ్మెల్యే అయినందునే తమ తల్లిని బెదిరిస్తున్నారని ఆమె వాపోయారు.
పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైన మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల జోలికి, వాళ్ల ఆఫీస్లకు వెళ్లకుండా కేవలం ? తమ తల్లి ఆఫీస్లపై మాత్రమే ఎందుకు దాడి చేస్తున్నారంటూ శ్రీదేవి కుమార్తె ప్రశ్నించారు. అసలు మాకు క్యాస్ట్ ఫీలింగ్ లేదని.. తాను పదో తరగతి చదువుకునే టైం వరకు కూడా క్యాస్ట్ అంటే ఏమిటో తెలియదని.. ఎవరైనా క్యాస్ట్ ఏంటని అడిగితే మా తల్లిదండ్రులను అడిగి చెపుతాం అనే వాళ్లమని చెప్పింది.