వైసీపీ నుంచి సస్పెన్షన్కు గురైన గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఈ రోజు హైదరాబాద్లో మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేస్తానంటూ వైసీపీ గుండాలు తన ఆఫీస్పై దాడి చేయడంతో పాటు చంపేస్తాం.. నరికేస్తాం అంటూ బెదిరిస్తున్నారని ఆమె సంచలన విషయాలు బయటపెట్టారు. మొన్న డాక్టర్ సుధాకర్ గారిలా, నిన్న డాక్టర్ అచ్చెన్న గారిలా రేపు కూడా డాక్టర్ శ్రీదేవి కాకూడదనే తాను కోరుకుంటున్నట్టు శ్రీదేవి తెలిపారు.
ఇక వైసీపీ దందాలతో పాటు అక్రమ మైనింగ్కు తాను బినామిగా ఉండేందుకు ఇష్టపడకపోవడంతోనే తనపై కక్ష కట్టారని శ్రీదేవి తెలిపారు. ఇక తాను డబ్బుకు అమ్ముడు పోయానని వైసీపీ ఆరోపణలు చేస్తోందని.. తనకు డబ్బు తీసుకోవాల్సిన అవసరమే లేదని శ్రీదేవి కుండబద్దలు కొట్టేశారు. ఇక డాక్టర్గా ఉన్నప్పుడే తమ ఇన్కం చాలా బాగుండేదని చెప్పారు.
తాను ప్రతి యేడాది యూరప్, అమెరికా వెళ్లేదానిని అని.. తాను మంచి లైఫ్ను వదులుకుని వెళ్లి తాడికొండ వెళ్లాల్సిన అవసరం లేదని.. తన తండ్రి జీవితాశయం కోసమే తాను అక్కడకు వెళ్లి ఎమ్మెల్యేగా పోటీ చేశానని శ్రీదేవి చెప్పారు. ఇక తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచే ఎన్నో వేధింపులు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని.. ఇప్పుడు ఇలా సాకు చూపి తనను పార్టీ నుంచి బయటకు పంపేశారని ఆమె విమమర్శించారు.