న‌రేష్ – ప‌విత్ర ఎఫైర్‌ను మ‌హేష్ ఆ గోల భ‌రించ‌లేకే ఒప్పుకున్నాడా…!

లేటు వయసులో ఘాటు ప్రేమతో సీనియర్ నటుడు నరేష్, పవిత్ర లోకేష్ జంట నిత్యం వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఈ జంట నటించిన మళ్లీ పెళ్లి సినిమా ఈనెల 26న రిలీజ్ కానుంది. రియల్ లైఫ్ లో కూడా వీళ్ళిద్దరి ప్రేమ, పెళ్లి వివాదాస్పదం కావడంతో ఇది ఈ సినిమా ప్రమోషన్ కు పనికొస్తుందన్న అభిప్రాయం అందరిలోనూ వినిపిస్తోంది. ఇక ఈ జంట ఇప్పటివరకు అధికారికంగా పెళ్లి చేసుకున్నారా ? లేదా అన్న సందేహం ఉంది. అయితే మళ్లీ పెళ్లి సినిమా ప్రమోషన్లలో మాత్రం నరేష్ తాను త్వరలోనే పవిత్రను అధికారికంగా పెళ్లి చేసుకుంటున్నట్టు క్లారిటీ ఇచ్చారు.

మళ్లీ పెళ్లి సినిమాను నరేష్ తన సొంత బ్యాన‌ర్‌లో నిర్మించారు. దీంతో ఈ సినిమా కోసం నరేష్, పవిత్ర ఇద్దరు ఉమ్మడిగా, విడివిడిగా కూడా ప్రమోషన్లు ఇస్తున్నారు. ఈ ఇంటర్వ్యూలలో ఈ సినిమా గురించి కంటే.. వీరి రియల్ లైఫ్ కు సంబంధించిన అంశాలే ఎక్కువగా చర్చికి వస్తున్నాయి. నరేష్, పవిత్ర ఇద్దరు తమ గాడమైన ప్రేమ గురించి జనాలకు చెబుతున్నారు. దీంతో ఈ సినిమా కథకంటే వీళ్ళిద్దరి నిజజీవితంలో చోటుచేసుకున్న అంశాలే ఇప్పుడు ప్రేక్షకుల మధ్య తరచూ చర్చ‌కి వస్తున్నాయి.

ఈ క్రమంలోనే తమ ఇద్దరి పెళ్ళికి వచ్చిన అడ్డంకులు గురించి కూడా వాళ్ళు తమదైన రీతిలో సమాధానం ఇస్తున్నారు. తమ వ్యక్తిగత జీవితంలో కొన్ని విషయాలను అడ్డం పెట్టుకొని కొందరు తప్పుగా ప్రచారం చేశారు అంటూ పవిత్ర లోకేష్ వాపోయారు. తాను కష్ట కాలంలో ఉన్నప్పుడు ఆత్మహత్య చేసుకునే దుస్థితి ఏర్పడింది అని.. అయితే ఈరోజు తాను స్వేచ్ఛగా సమాజంలో తిరుగుతున్నాను అంటే కేవలం నరేష్ అండతోనే అని పవిత్ర కొండబద్దలు కొట్టారు.

ದುಷ್ಟಶಕ್ತಿಗಳಿಂದ ನನ್ನನ್ನು ಕಾಪಾಡಿ ಹೊಸ ಜೀವನ ಕೊಟ್ಟ ಮಹಾಪುರುಷ ನರೇಶ್: ಪವಿತ್ರಾ ಲೋಕೇಶ್ ಬಣ್ಣನೆ | Pavitra Lokesh Praised Naresh Said He Saved Me From Evil People, Give Me New Life | TV9 Kannada

ఇక తమ ఇద్దరి బంధానికి విజయనిర్మల, కృష్ణ గార్లతో పాటు మహేష్ బాబు కూడా ఓకే చెప్పినట్టు పవిత్ర తెలిపారు. మహేష్ బాబు, కృష్ణ కుటుంబాలు రెండు కూడా తమ జంటను అంగీకరించాయని పవిత్ర వెల్లడించటం విశేషం. దీంతో అసలు మహేష్ ఈ జంట బంధాన్ని ఎందుకు అంగీకరించారు ?అన్నదానిపై కూడా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. వీరిద్ద‌రి తీరుతో కృష్ణ అభిమానులు కూడా బాగా బాధ‌ప‌డే ప‌రిస్థితి వ‌చ్చింది.

అయితే ప‌విత్ర‌, న‌రేష్ విష‌యంలో తాను అడ్డు త‌గిలితే ఇది మ‌రింత ర‌చ్చ‌గా మారి.. ఫైన‌ల్‌గా కృష్ణ గారి ప‌రువుకు భంగం క‌లుగుతుంద‌నే మ‌హేష్ వాళ్ల ఇష్టానికి వాళ్ల‌ను వ‌దిలేసిన‌ట్టుగానే తెలుస్తోంది.