మాస్ మహారాజా రవితేజ “రామారావు ఆన్ డ్యూటీ” సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు. శరత్ మండవ ఈ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్ మరియు రజిషా విజయన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా రేపు విడుదల కానున్న తరుణంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ సీన్ సోషల్ మీడియాలో లీక్ అయింది.
లీకైన సన్నివేశం సినిమాలో చాలా ముఖ్యమైన యాక్షన్ సీక్వెన్స్గా కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు రవితేజ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చే సన్నివేశాన్ని మనం చూడవచ్చు.“రేయ్, మీరూ ఎవరో, ఏ పార్టీ ఓ నాకు అనవసరం. ఎవరైన సరే, అధికారంలో ఉన్నాం కదా అని, కొండలు తవ్వేస్తాం, చెరువులు పూడ్చేస్తాం, అడ్డంగా భూములు కొట్టేస్తాం అని దౌర్జన్యం చేద్దాం అనుకుంటే…“ అనే డైలాగ్ తో కూడిన వీడియో లీక్ అయింది .
ఈ డైలాగ్ బట్టి చూస్తే ఈ చిత్రం బలమైన సామాజిక సందేశాన్ని కలిగి ఉన్నట్లు అనిపిస్తుంది మరియు ఈ చిత్రంలో రవితేజ ప్రభుత్వ అధికారిగా కనిపిస్తాడు.లీకైన వీడియో గురించి టీమ్ ఆందోళన చెందుతోంది మరియు ఆ సన్నివేశం సంబంధించి వీడియో ఎలా లీక్ అయ్యిందో తెలుసుకోవడంలో బిజీగా ఉంది.హీరో వేణు తొట్టెంపూడి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించాడు.