బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ పై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి సంచలన ఆరోపణలతో విరుచుకు పడింది. కరణ్ జోహార్ ఒక స్టార్ హీరోయిన్ ను మానసికంగా వేధించాడని అందువల్లే ఆమె బాలీవుడ్ ను వదిలి వెళ్ళిపోయిందని కంగాన చెప్పింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు ప్రియాంక చోప్రా. ప్రియాంక ఇటీవల తాను బాలీవుడ్ కు దూరం కావటంపై స్పందించిన విషయం తెలిసిందే.
ఓ అమెరికన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక మాట్లాడుతూ హిందీ పరిశ్రమంలో రాజకీయాలు ఎక్కువగా ఉంటాయని.. వాటిని తట్టుకోలేక తాను హాలీవుడ్ కి వచ్చేసానని చెప్పింది. ప్రస్తుతం ప్రియాంక చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వ్యాఖ్యలను ఉద్దేశించి కంగనా ట్విట్టర్ వేదికగా స్పందించింది.
బాలీవుడ్ లో కొందరు గ్యాంగ్ గా మారి ప్రియాంక చోప్రాను అవమానించారు. స్వయంకృషితో ఎదిగిన మహిళను మన దేశం వదిలి వెళ్ళిపోయేలా చేశారంటూ మండిపడింది. ఇక కరణ్ జోహార్ ప్రియాంకను బ్యాన్ చేశారనే విషయం అందరికీ తెలుసు. షారుక్ ఖాన్ తో ప్రియాంక చోప్రా స్నేహంగా ఉండటం కరణ్ జోహార్ కు నచ్చలేదని.. అందుకే ఆమెను కరణ్ దూరం పెట్టాడని అప్పటి బాలీవుడ్ మీడియాలో ఎన్నో కథనాలు వచ్చాయి.
షారుక్ ఖాన్ తో ప్రియాంక చాలా క్లోజ్ గా ఉండేవారన్నది నిజం. దాన్ని తట్టుకోలేక కరణ్ జోహార్ ఆమెను బాగా ఇబ్బంది పెట్టడంతో పాటు.. కొందరు హీరోల సినిమాలలో అవకాశాలు రాకుండా చేశాడని.. కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. ప్రియాంక కెరీర్ నాశనం చేసినందుకు కరణ్ బాధ్యత వహించాలి. అమితాబ్ సార్ వంటి వారు సినిమాల్లోకి వచ్చిన రోజుల్లో ఇలాంటి పరిస్థితులు లేవు అని కంగనా తన మెసేజ్లో పేర్కొంది.