మెగాహీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలపై అఫీయల్ అనౌన్స్ మెంట్ రాలేదు కానీ అటు మెగా ఫ్యామిలీ ఇటు లావణ్య పెళ్లి వార్తలపై గప్ చుప్ గా ఉంటున్నారు. కొన్నింటికి మౌనమే సమాధానం అంటూ ఉంటారు కాబట్టి లావణ్య వరుణ్ తేజ్ పెళ్లి వార్తలను కూడా అలాగా చూస్తున్నారు. ఇద్దరూ పెళ్లి వార్తలపై మౌనంగా ఉండటంతో పెళ్లి చేసుకోవడం పక్కా అని అంతా అనుకుంటున్నారు.
లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ తో కలిసి మిస్టర్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడిందట. ఆ పరిచయం కాస్త కొంతకాలానికి ప్రేమగా మారినట్టు తెలుస్తోంది. వరుణ్ తేజ్ కూల్ నెస్ కు అతడి మంచితనానిని లావణ్య త్రిపాఠి ఫిదా అయినట్టు తెలుస్తోంది. వరుణ్ కూడా లావణ్యను ఇష్టపడటంతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించినట్టు తెలుస్తోంది.
దాంతో వరుణ్ తేజ్ మొదట లావణ్య త్రిపాఠిని తన సోదరి నిహారిక వివాహానికి తీసుకువచ్చి కుటుంబానికి పరిచయం చేశాడు.నిహారిక వివాహం కేవలం కుటుంబ సభ్యుల మధ్యలో జరిగింది. కానీ లావణ్య మాత్రం ఈ పెళ్లి కోసం ముందే వాలిపోయింది. అంతే కాకుండా మెగాఫ్యామిలీతో కలిసి ఫ్యామిలీ ఫోటో కూడా దిగింది. అప్పటి నుండే వరుణ్ లావణ్య పెళ్లి వార్తలకు మరింత బలం చేకూరింది. ఇక ఇప్పుడు అతిత్వరలోనే వరుణ్ తేజ్ లావణ్య మెడలో తాళికట్టబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే పెళ్లి సమయంలో అమ్మాయి తరపున కుటుంబ సభ్యులు అబ్బాయికి కట్నం ఇస్తారన్న సంగతి తెలిసిందే. అయితే మెగాఫ్యామిలీ కట్నం వద్దని చెబుతున్నా లావణ్యత్రిపాఠి ఫ్యామిలీ మా తృప్తి కోసం కూతురుకు కొంత ఇచ్చుకుంటామని చెబుతున్నారట. అంతే కాకుండా ఇప్పటికే 5 కేజీల బంగారం, ఆరు కోట్ల రూపాయలను కట్నంగా ఇస్తామని మెగాఫ్యామిలీని ఒప్పించారట.
వీటితో పాటూ ఓ లగ్జరీ బంగ్లా మరియు కార్ ను కూడా గిఫ్ట్ గా ఇస్తామని లావణ్య పేరెంట్స్ ఒప్పుకున్నారట. ఇక ఇప్పటికే వరుణ్ తేజ్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించకున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా లావణ్య కూడా హీరోయిన్ గా అభిమానులను సంపాదించుకుంది కానీ భర్త కండిషన్ మేరకు సినిమాలకు గుడ్ బై చెప్పబోతుంది అని టాక్.