ప్రస్తుతం ప్రయోగాలు చేయాలంటే రాజమౌళి అయితే.. ఒకప్పుడు ప్రయోగాత్మక సినిమాలకుపెట్టింది పేరు సింగీతం శ్రీనివాస రావు. ఎలాంటి టెక్నాలజీ లేని సమయంలోనే సింగీతం శ్రీనివాసరావు తన టాలెంట్తో ఎన్నో అద్భుతాలను సృష్టించారు. సింగీతం శ్రీనివాసరావు జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా తరవాత సైన్స్ ఫిక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమానే ఆదిత్య 369. ఈ సినిమాలో నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించారు.
లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ కంటే ముందే ఏఎన్నార్ను ట్రై చేసిందా… అప్పుడేమి జరిగిందంటే..
ఈ సినిమా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగులో వచ్చిన మొదటి టైం ట్రావెల్ ఈ సినిమా కూడా ఇదే కావడం మరో విశేషం. ఈ సినిమాతో బాలయ్య నటనా పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. సినిమాల్లో బాలయ్య తన పాత్రలలో పరకాయ ప్రవేశం చేశాడు. ఈ సినిమా తెరవెనక జరిగిన ఎన్నో విషయాలు ప్రేక్షకులకు తెలియదు. దర్శకుడు సింగీతం మొదట ఈ సినిమా కథను విమానంలో ప్రయాణిస్తున్న సంధర్బంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు చెప్పారు.
కృష్ణాలో ఆ టీడీపీ వారసుడు గెలుపు పక్కా… బంపర్ విక్టరీ కొడుతున్నాడా..!
కథ విన్న తరవాత ఆయన చాలా భాగుందని మెచ్చుకున్నారు. ఈ సినిమాకు ప్రముఖ రచయిత జంధ్యాల సంభాషణలు రాశారు. అంతే కాకుండా ఈ సినిమాలో బాలయ్యకు శ్రీకృష్ణదేవరాయులు పాత్ర సూపర్గా సెట్ అవుతుందని జంధ్యాల చెప్పారు. ఈ సినిమాలో నటుడు చంద్రమోహన్ తెనాలి రామకృష్ణుడి పాత్రలో నటించారు. విలన్గా అమ్రిష్ పురి నటించాడు. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్ర కృష్ణ కుమార్ కోసం మొదట కమల్ హాసన్ను సింగీతం శ్రీనివాస రావు అనుకున్నారుట.
జూనియర్ ఎన్టీఆర్ పార్టీలో టీడీపీ యంగ్ లీడర్…!
అంతే కాకుండా కమల్ హాసన్కు ఈ కథను కూడా వినిపించారట. కమల్ హాసన్ అ సమయంలో తన డేట్స్ సర్దుబాటు కావడం లేదని నో చెప్పారట. అయితే ఆ తరవాత ఎస్పీ. బాలు, సింగీతం శ్రీనివాసరావుతో మాట్లాడుతూ…ఆ క్యారెక్టర్ ను కూడా బాలయ్యతో వేయిస్తే బాగుంటుందని సూచించారు. అలా బాలయ్య ద్విపాత్రాభినయం చేయాల్సి వచ్చింది. ఇక బాలయ్య ఎక్కడా తగ్గకుండా తన నటవిశ్వరూపం ప్రదర్శించిన సంగతి తెలిసిందే. సినిమా సూపర్ హిట్ అయ్యాక కమల్ అయ్యో మంచి సినిమా మిస్ అయ్యానని చాలా బాధపడ్డారట.
ఈ ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలను టచ్ చేసే దమ్మెవ్వరికి లేదా… ఒక్కటే కారణం…!