ఉమ్మడి అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ కంచుకోట అనే చెప్పాలి..ఈ జిల్లాలో టిడిపి మంచి విజయాలు సాధిస్తూ వచ్చింది. కానీ గత ఎన్నికల్లోనే జిల్లాలో దారుణంగా ఓడిపోయింది. అయితే ఇప్పుడు అక్కడ టిడిపి పుంజుకుంటూ వస్తుంది. ఈ నాలుగేళ్లలో జిల్లాపై టిడిపి పట్టు తెచ్చుకుంది. మెజారిటీ సీట్లలో పుంజుకుంది. కానీ ఇంకా కొన్ని సీట్లలో టిడిపి పుంజుకోవాల్సి ఉంది.
అలా టిడిపి పుంజుకోవాల్సిన సీట్లలో పుట్టపర్తి కూడా ఒకటి అని చెప్పవచ్చు. వరుసగా ఇక్కడ మంచి విజయాలే సాధించిన టిడిపి గత ఎన్నికల్లో మాత్రం చిత్తుగా ఓడింది. టిడిపి నుంచి పల్లె రఘునాథ్ రెడ్డి ఓడిపోయారు. ఓడిపోయాక ఈయన కొన్ని రోజులు దూకుడుగా పనిచేయలేదు. అటు ఇక్కడ పల్లెకు వ్యతిరేకంగా కొందరు నేతలు గ్రూపులు కట్టారు. పల్లెకు మళ్ళీ సీటు రాకుండా చేయడమే లక్ష్యంగా వారు ముందుకెళుతున్నారు.
ఎవరికి సీటు ఇచ్చిన పర్లేదు గాని..పల్లెకు మళ్ళీ సీటు ఇస్తే తాము సహకరించే పరిస్తితి లేదన్నట్లు కొందరు నేతలు ఉన్నారు. అంటే పల్లెకు సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉంది..అటు నియోజకవర్గంపై ఆయనకు పట్టు దొరకలేదు. ఇక్కడ ఇంకా వైసీపీకే ఆధిక్యం కనిపిస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ నారా లోకేష్ పాదయాత్ర జరుగుతుంది. పాదయాత్రకు భారీ స్థాయిలో జనం వస్తున్నారు. ఇక లోకేష్ సైతం పుట్టపర్తిలో పార్టీ బలం పెంచేలా ముందుకెళుతున్నారు.
అదే సమయంలో నాయకులని సమన్వయం చేసి..అక్కడ పరిస్తితులని సెట్ చేస్తారేమో చూడాలి. అయితే ఇక్కడ పార్టీ పరంగా టిడిపి పరిస్తితి బాగానే ఉంది..కానీ నాయకత్వ పరంగా పల్లెకు కాస్త వ్యతిరేకత కనిపిస్తుంది. అయితే లోకేష్ మాత్రం పల్లెకు సీటు విషయంలో గ్యారెంటీ హామీ ఇచ్చినట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో పల్లె వర్గంలో కొత్త జోష్ అయితే కనిపిస్తోంది.