సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నా.. కొత్త బ్యూటీలు పుట్టుకొస్తున్నా.. ఒకప్పటి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న త్రిష్ అంటే అందరికీ ఆదోరకమైన తెలియని గౌరవం . మరీ ముఖ్యంగా రీసెంట్గా రిలీజ్ అయిన పోనియన్ సెలవ్న్ సిరీస్ లో త్రిష ఎంత అందంగా కనిపించిందో మనందరికీ తెలిసిందే . ముట్టుకుంటే కందిపోతుందేమో ముట్టుకోకపోతే ఫీలింగ్ రాదేమో అన్నంత అందం త్రిషకి దక్కింది.
ఈ క్రమంలోనే త్రిషకి సంబంధించిన గత తాలూకా వార్తలు వైరల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. అందరి హీరోయిన్స్ సెకండ్ ఇన్నింగ్స్ కోసం ట్రై చేస్తుంటే ..కేవలం త్రిషనే ఎందుకు క్లిక్ అయింది అన్న వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం త్రిష సెకండ్ ఇన్నింగ్స్ కి ఆమె జాన్ జిగిడి దోస్త్ అయిన హీరోనే కారణం అంటూ తెలుస్తుంది . పెళ్లి బ్రేకప్ అయిన తర్వాత కొన్నాళ్లు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న త్రిష సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి ఆ స్టార్ హీరోనే లీడ్ తీసుకున్నారట .
గతంలో ఆ స్టార్ హీరోతో రెండు మూడు సినిమాల్లో నటించి క్రేజీ హిట్లు అందుకున్న త్రిష.. మళ్లీ ఆ హీరో చెప్పడం ద్వారానే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఈ పొజిషన్లో ఉంది అంటూ చెప్పుకొస్తున్నారు . అంతేకాదు అంతలా తన నటనతో ఆ హీరోను సాటిస్ఫై చేసిందని.. అందుకే ఎవరికి హెల్ప్ చేయని ఆ హీరో త్రిష కు హెల్ప్ చేసి ఇప్పుడు ఈ స్థానంలో పెట్టాడు అంటూ చెప్పుకొస్తున్నారు, ఏది ఏమైనా ఈ మధ్యకాలంలో త్రిషకి సంబంధించిన వార్తలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి..!!