త్రిబుల్ ఆర్ నిర్మాత దాన‌య్య కొడుకుతో స‌మంత పెళ్లి క‌న్‌ఫార్మ్‌..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత – అక్కినేని హీరో నాగచైతన్యకు విడాకులు ఇచ్చేసి రెండేళ్లు కావస్తోంది. వీరిద్దరు విడాకులు తీసుకున్నప్పటినుంచి వీరిద్దరిపై ప్రతిరోజు రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇటు సమంత మరో వ్యక్తితో ప్రేమలో ఉందని రెండో పెళ్లికి సిద్ధమవుతుందని.. అటు నాగచైతన్య కూడా హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ప్రేమాయణం నడుపుతున్నాడని.. వీరిద్దరు కూడా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

Adhira Movie: Showtimes, Review, Songs, Trailer, Posters, News & Videos |  eTimes

తాజాగా పైన మీరు చూసిన టైటిల్ తో మీ మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది. త్రిబుల్ ఆర్ సినిమా నిర్మాత దానయ్య కుమారుడితో సమంత వివాహం అధికారికంగా నిశ్చయం అయింది. అయితే ఇది నిజం. దానయ్య కుమారుడు సమంతను పెళ్లి చేసుకోబోతున్నాడు. అయితే ఆ సమంత హీరోయిన్ సమంత కాదు.. తన ప్రియురాలు సమంతా రెడ్డితో దానయ్య కొడుకు పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. వీరిద్దరి వివాహం ఈనెల 20న జరగనుంది.

ఈ పెళ్లి వేడుకకు తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా హాజరు కాబోతున్నారు. ఇక దాన‌య్య‌ గత ఏడాది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకు ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో త్రిబుల్ ఆర్ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ పాన్ ఇండియా సినిమాతో దానయ్య పేరు ఒక్కసారిగా నేషనల్ వైడ్‌ గా వైరల్ అయింది.

Kalyan Dasari (@IamKalyanDasari) / Twitter

ప్రస్తుతం దానయ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఓజి సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సాహో సినిమా దర్శకుడు సుజిత్ దర్శకుడు. ఇక దానయ్య తనయుడు దాసరి కళ్యాణ్ త్రిబుల్ ఆర్‌ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో అధీరా అనే సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే తాను ప్రేమించిన ప్రియురాలు సమంత రెడ్డితో ఈ నెలలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు.