ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో సినిమా వర్గాలలో ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . అందాల ముద్దుగుమ్మ మహానటిగా పేరు సంపాదించుకున్న కీర్తి సురేష్ మరోసారి మహేష్ బాబు సినిమాలో నటించబోతుందా..? అంటే అవునని అంటున్నారు సినీ విశ్లేషకులు . ఆల్రెడీ వీళ్ళిద్దరూ కలిసి “సర్కారీ వారి పాట” అనే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు . పరశురాం డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
కీర్తి సురేష్ మహేష్ బాబు కెరియర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. ఈ సినిమాల్లో వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది . ఈ సినిమా ద్వారానే కీర్తి సురేష్ తనలోని బోల్డ్ యాంగిల్ ని కూడా బయటపెట్టింది . కాగా మరోసారి మహేష్ బాబు కీర్తి సురేష్ జతకట్ట బోతున్నారు అని తెలియడంతో ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు . మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్షన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే రెండు షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలోనే మూడో షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది . ఈ క్రమంలోనే ఈ సినిమాలో కీ రోల్ కోసం కీర్తి సురేష్ ను అప్రోచ్ అయ్యారట త్రివిక్రమ్ . అయితే పాత్ర చిన్నది కావడంతో కీర్తి సురేష్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదని ఈ క్రమంలోనే మహేష్ కాల్ చేసి మరి రిక్వెస్ట్ చేసి కీర్తిని ఆ రోల్లో నటించే విధంగా ఒప్పించాడని ఓ న్యూస్ వైరల్ అవుతుంది.
దీంతో మహేష్ బాబుకు కీర్తి అంటే అంత ఇష్టమా..? కాల్ చేసి మరీ ఒప్పించాల్సిన అవసరం ఏముంది..? అంటూ కొందరు మాట్లాడుతుంటే ..మరికొందరు ఈ పాత్రకి ఆమె సెట్ అవుతుంది ..అందుకే మహేష్ ఆమె నటనకు ఫిదా అయ్యాడు అంటూ చెప్పుకొస్తున్నారు . ఏది ఏమైనా మరోసారి తెరపై మహేష్ కీర్తలను జంటగా చూడబోతున్నాం అని తెలిసి ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అవుతున్నారు..!!