మహేష్ కొడుకు గౌతమ్ హీరోగా ఎంట్రీ.. క్రేజీ అప్డేట్స్ ఇచ్చిన నమ్రత శిరోద్కర్..!!

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు నమ్రతలకు కొడుకు గౌతమ్, కూతురు సితార ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే మహేష్ బాబు గారాల పట్టి సితార సర్కారు వారి పాట సినిమాలో గెస్ట్ పీరియడ్స్ రోల్ ప్లే చేసింది. తాజాగా పీఎంజే జ్యువెలరీ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించి న్యూయార్క్ టైం స్క్వేర్ పై కనిపించింది.

తండ్రికి తగ్గ కూతురిగా మంచి క్రేజ్ సంపాదించుకున్న సితార‌ ఇండస్ట్రీలోకి తప్పకుండా హీరోయిన్గా అడుగుపెడుతుందని అర్థమవుతుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో సితారకు సంబంధించిన ఏ ఫోటో వచ్చిన న్యూస్ వచ్చిన మహేష్, సితార ఫ్యాన్స్ దాన్ని తెగ వైరల్ చేస్తున్నారు. కాగా కొడుకు గౌతమ్ ఎంట్రీ గురించి ఒక క్రేజీ అప్డేట్ ని ఇచ్చింది నమ్రతా శిరోద్కర్. ఇండియాలో పీఎంజి జువెలరీ బ్రాంచ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు నమ్రత, సితార. అక్క‌డ కొందరు మీడియా వాళ్ళు గౌతమ్ ఫిల్మ్ ఎంట్రీ గురించి అడిగిన ప్రశ్నకు ఇలా స్పందించింది న‌మ్ర‌త.

గౌతమ్ ప్రస్తుతం చదువుకుంటున్నాడని.. గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాల్సి ఉందని.. గౌతమ్ కచ్చితంగా హీరో అవుతాడు కానీ వాడు చదువు పూర్తయ్య సరికి 6,7 ఏళ్ళ‌ సమయం పడుతుందని వెల్లడించింది. గౌతమ్ ఫోకస్ ఇప్పుడు స్టడీస్ పైనే ఉందని చెప్పడంతో మొత్తానికి హీరోగా మహేష్ కొడుకు గౌతమ్ ఎంట్రీ కన్ఫర్మ్ చేసింది నమ్ర‌త‌. కానీ ఇంకా దానికి సమయం ఉందని చెప్పడంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్.