నందమూరి నటసింహ బాలకృష్ణ వయసు పెరుగుతున్నా అదే ఉత్సాహం.. అదే ఎనర్జీతో దూసుకు పోతున్నారు. అఖండ, వీరసింహారెడ్డి లాంటి రెండు సూపర్ హిట్ సినిమాలు తర్వాత బాలయ్య సక్సెస్ రేట్ ఊహించని రేంజ్ లో పెరిగిపోయింది. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. బాలయ్య తన పిల్లలను చాలా క్రమశిక్షణతో పెంచారు. ఏనాడు వారు బయట కనిపించలేదు. బాలయ్య ఇద్దరు కుమార్తెల సంబంధాలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా చేశారు.
పెద్ద కుమార్తెకు బ్రాహ్మణిని తన మేనల్లుడు నారా లోకేష్ కి ఇచ్చి వివాహం జరిపిస్తే.. రెండో కుమార్తె తేజస్విని వైజాగ్ గీతం విద్యాసంస్థల డైరెక్టర్ మెతుకుమిల్లి శ్రీ భరత్ కి ఇచ్చి పెళ్లి చేశారు. అయితే బాలయ్య ఇద్దరు కుమార్తెల సంబంధాలు సెట్ చేసింది మహిళలే కావడం విశేషం. పెద్ద కుమార్తె బ్రాహ్మణిని తన కోడలుగా చేసుకోవాలని చంద్రబాబు భార్య భువనేశ్వరి బలంగా ఫిక్స్ అయిపోయారు.
తన తమ్ముడు కూతురు.. తన ఇంటి కోడలుగా రావాలని చంద్రబాబు దగ్గర పట్టుపట్టారు. అయితే ఆయన మనసులో ఏముందో ? కానీ భువనేశ్వరి పట్టుబట్టడంతో ఆమె మాటకే ఓటు వేశారు. భువనేశ్వరి కోరుకున్నట్టుగానే బ్రాహ్మణి – లోకేష్ భార్యాభర్తలు అయ్యారు. ఇక బాలయ్య రెండో కుమార్తె తేజస్విని సంబంధాన్ని భరత్ పెద్దమ్మ సెట్ చేశారట. బాలయ్య భార్య వసుంధర, భరత్ వాళ్ళ అమ్మ ,వాళ్ళ పెద్దమ్మ హైదరాబాద్ లో ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నారట.
చదువు పూర్తయ్యి.. పెళ్లిళ్లు అయ్యాక కూడా వీరంతా అప్పుడప్పుడు కలుసుకోవడంతో వీరి మధ్య పరిచయాలు ఎక్కువగా ఉండేవట. భరత్ చదువుకోవడానికి అమెరికా వెళ్ళినప్పుడు పెళ్లి ప్రస్తావన రావడంతో ముందుగా భరత్ వాళ్ళ పెద్దమ్మ రెండు కుటుంబాలతో మాట్లాడి ఈ పెళ్లి సెట్ చేశారని భరత్ తెలిపారు. ఈ పెళ్లి జరిగే సమయానికి భరత్ వయసు కేవలం 23 సంవత్సరాలు. చిన్న వయసులో పెళ్లి జరిగితే భార్యాభర్తలు ఇద్దరు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి సరైన సమయం ఉంటుందని భరత్ చెప్పారు.