స‌మంత – నిహారిక విడాకుల్లో సేమ్ టు సేమ్ ట్విస్టులు చూశారా…!

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక తన భర్త వెంకట చైతన్యతో గ్యాప్ మెయింటెన్ చేస్తుంది. వీరిద్దరి మ‌ధ్య‌ మనస్పర్ధలు వచ్చాయని అందుకే విడాకులు తీసుకోబోతున్నారని టాక్ కూడా వినిపిస్తుంది. ఈ వార్తలు నిజం అనుకోనేలా ఇద్దరు సోషల్ మీడియాలో చేసే పోస్టులు కూడా అందరికీ షాక్ ఇస్తున్నాయి. చైతన్య ముందుగా పెళ్లి ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి డిలీట్ చేయగా.. తర్వాత నిహారిక సైతం మ్యారేజ్ ఫోటోలను డిలీట్ చేసింది. ఇద్దరు కలిసి జంటగా కనిపించి ఇప్పటికే సంవత్సరం పైగా అవుతుంది.

ఈ సమయంలో నిహారిక తన వ్యక్తిగత విషయాలను పక్కనపెట్టి తన సినీ కెరియర్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది. వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌లో నటిస్తూ ఇదే క్రమంలో పలు వెబ్ సిరీస్‌లు కూడా నిర్మిస్తుంది. రీసెంట్‌గా డెడ్ పికిల్స్ అనే టైటిల్‌తో వెబ్ సిరీస్ లో కూడా నటించి నిర్మించింది. ఇక ప్రస్తుతం ఈ మెగా బ్యూటీ వెకేషన్ కోసం బాలి అనే దేశం వెళ్ళింది.. అక్కడ వెకేషన్ లో తన ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను నిహారిక తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. ఇదే సమయంలో నిహారికపై ఆసక్తికరమైన చర్చ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.. నిహారికను స్టార్ హీరోయిన్ సమంతతో పోల్చుతున్నారు. సమంత కూడా విడాకుల సమయంలో ఇలానే చేసింది. ఆమె తన స్నేహితులతో కలిసి ఇతర దేశాలకు వెకేషన్‌కు వెళ్ళేది. డిప్రెషన్ నుంచి బయటికి వచ్చేందుకు సమంత తన స్నేహితుల సహాయం తీసుకుంది.. కొన్ని ఆధ్యాత్మిక ప్రదేశాలకు కూడా ఆ సమయంలో వెళ్ళింది.

ఇక ఇప్పుడు నిహారిక వెకేషన్ కి వెళ్లడానికి కూడా విడాకులే కారణమని అంటున్నారు.. ఇప్పటికే ఇరు కుటుంబాలు చేసిన సంధి ప్రయత్నాలు కూడా బెడిసి కొట్టాయట. ఇప్పటికే వీరిద్దరు విడాకుల కోసం లీగల్ వర్క్ కూడా మొదలు పెట్టేసారట.. అతి త్వరలోనే విడాకులు ప్రకటన కూడా రానుందని అంటున్నారు. ఇలా విడాకులు విషయంలో సమంత- నిహారిక మధ్య పోలిక కుదిరిందని నెటిజన్లు అంటున్నారు.

ఇక ఇప్పుడు సమంత తన గడిచిపోయిన రోజులనును వదిలేసి తన జీవితంలో ఎంతో హ్యాపీగా ఉంటోంది. 2020లో నిహారిక -వెంకట చైతన్య వివాహం ఉదయపూర్ ప్యాలెస్ లో జరిగింది.కేవలం నాలుగు సంవత్సరాలు వ్యవధిలోని నిహారిక విడాకులు తీసుకోనుండ‌డంతో మెగా కుటుంబం బాగా అప్సెట్ అవుతున్నారని కూడా తెలుస్తోంది.