దర్శకత్వం వహించింది రెండు సినిమాలు అయినా రెండు సూపర్ హిట్ కావడంతో ఓ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు నాగ అశ్విన్. మొదటి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యంతో హిట్ కొట్టిన నాగ్ అశ్విన్ తర్వాత కీర్తి సురేష్ హీరోయిన్ గా మహానటి సావిత్రి జీవిత చరిత్ర తర్కెక్కించాడు. మహానటి సూపర్ హిట్ కావడంతో మంచి పాపులారిటీ వచ్చింది. తమిళ్, సౌత్లో కూడా ఈ సినిమా ఒక ఊపు ఊపింది. మహానటి బడాబడా డైరెక్టర్లను, యాక్టర్లను కూడా మెప్పించింది. మహానటి ఇచ్చిన ఉత్సాహంతోనే వైజయంతి మూవీస్ బ్యానర్ పేరు మళ్లీ మారుమోగిపోయింది.
ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ప్రాజెక్టు కే సినిమాను రు. 600 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న అన్ని సినిమాల్లో ప్రాజెక్ట్ కే సినిమాపై ప్రేక్షకుల అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక వైజయంతీ అధినేత అశ్వినీ దత్ కుమార్తె ప్రియాంక దత్ ను నాగ అశ్విన్ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అసలు వీరిద్దరూ ఎలా కలిశారు..? వారిద్దరి లవ్ స్టోరీ ఏంటి..? డాక్టర్ కావల్సినోడు డైరెక్టర్ ఎలా..? అయ్యాడు ఇవన్నీ వింటే కాస్త విచిత్రంగానే అనిపిస్తుంది.
నాగా అశ్విన్ డాక్టర్ అవడం కోసం అమెరికాలో చదువుకుంటున్నాడు. డైరెక్టర్ అవ్వాలని కోరికతో అక్కడ ఫిలిం మేకింగ్ కోర్స్ కంప్లీట్ చేసాడు. ఇండియాకు వచ్చి శేఖర్ కమ్ముల దగ్గర అసిస్టెంట్గా పనిచేశాడు. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాను ఫస్ట్ టైం డైరెక్ట్ చేశాడు. నాని హీరోగా విజయ్ దేవరకొండ కీరోల్ ప్లే చేసిన ఈ సినిమా క్లాసికల్ హిట్గా తెరకెక్కి సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాకు నిర్మాణ బాధ్యతలను ప్రియాంక చూసుకునేది. ఈ క్రమంలో వీరి మధ్య పరిచయం ఏర్పడి.. ఆ పరిచయం ప్రేమగా మారిందట.
మొదటిగా ప్రేమ విషయాన్ని ప్రియాంక.. నాగ అశ్విన్తో ప్రస్తావించడం.. ఆ తర్వాత నాగ అశ్విన్ ప్రియాంక ప్రేమను అంగీకరించడం జరిగిపోయాయి. ఏదేమైనా వైజయంతీ బ్యానర్ కు పేరు ప్రఖ్యాతలు ఈ తరంలో కూడా మహానటి సినిమాతో కంటిన్యూ చేసిన ఘనత నాగా అశ్విన్కే దక్కింది. మహానటి సూపర్ హిట్ కావడంతో మహా ప్రొడ్యూసర్లకు సరైన అల్లుడు దొరికాడని ఇండస్ట్రీ అంతా మెచ్చుకుందట. తన తల్లిదండ్రులు డాక్టర్ చదువు వదులుకొని అమెరికా నుంచి ఇక్కడికి ఎందుకు ? వచ్చాడు అని బాధపడే వారిని.. మహానటి సినిమా చూశాక గర్వంగా ఫీలయ్యారంటూ నాగ అశ్విన్ ఓ సందర్భంలో వివరించాడు.