భారత క్రికెటర్లకు ఎంతోమందితో ఎఫైర్లు నడుస్తూ ఉంటాయి. క్రికెటర్లకు, హీరోయిన్లకు మధ్య మామూలు ఎఫైర్లు ఉండవు. ఇది గత కొన్ని దశాబ్దాల నుంచి నడుస్తూనే ఉంది. ఇక భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు మధ్య ఎప్పటి నుంచో సరైన సంబంధాలు లేవన్న పుకార్లు అయితే ఉన్నాయి. వీరిద్దరికి ఒకరంటే మరొకరికి ఏ మాత్రం పడదని.. అందుకే మైదానంలోనూ అంత క్లోజ్గా ఉండరనే అంటారు.
అసలు వీరిద్దరి మధ్య ఎందుకు ? సఖ్యత లేదు. ఏం జరిగింది ? అన్నదానిపై ఓ టాప్ సీక్రెట్ ఎట్టకేలకు బయటకు వచ్చింది. ఇది ఇప్పుడు నేషనల్ మీడియాను ఊపేస్తోంది. గతంలో విరాట్ కోహ్లీతో, రోహిత్ శర్మ భార్య డేటింగ్ చేసిందట. ఇందుకు సాక్ష్యంగా కోహ్లీతో రోహిత్ శర్మ భార్య కలిసి దిగిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
ఇక ఈ డేటింగ్ రితికకు రోహిత్శర్మతో పెళ్లికి ముందు జరిగిందట. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఈ ఫొటో బయటకు తీసి వైరల్ చేస్తున్నారు. ఇక ఆ తర్వాత విరాట్ కోహ్లీ అనుష్క శర్మను, రోహిత్ రితికను వివాహం చేసుకుని హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. గత సంఘటనలు ఎలా ? ఉన్నా అవన్నీ మర్చిపోయి కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ దేశం కోసం కలిసికట్టుగా ఆడుతున్నారు.
అయితే ఈ ఇద్దరు క్రికెటర్ల ఫ్యాన్స్ మాత్రం ఇప్పుడు పాత విషయాలు బయటకు లాగుతూ లేనిపోని రచ్చ చేస్తున్నారు. గతంలో కోహ్లీకి రోహిత్శర్మ భార్య రితిక మేనేజర్గా పనిచేసిందట. ఈ క్రమంలోనే ఆ టైంలో వారిద్దరు కలిసి దిగిన ఫొటోలు బయటకు వదులుతూ వీరి మధ్య ఎఫైర్ నడిచిందంటూ పుకార్లు రేపుతున్నారు. మరి అసలు వీరి మధ్య ఏం ఉందో ? అన్నది వారికే తెలియాలి.