దేవిశ్రీప్రసాద్.. ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. 20 ఏళ్ల క్రితం దేవి కంపోజ్ చేసిన చాలా పాటలు అదే క్రేజ్ తో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోల మూవీస్ అన్నిటికీ మ్యూజిక్ కంపోజ్ చేశాడు దేవిశ్రీ. పవన్ కళ్యాణ్ – డీఎస్పీ కాంబినేషన్లో వచ్చిన మూవీ సాంగ్స్ బ్లాక్ బాస్టర్ గా నిలిచాయి. జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది వంటి సూపర్ హిట్ సినిమాలకు దేవిశ్రీ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.
ఇక ఇటీవల వచ్చిన పుష్ప మూవీ మ్యూజిక్ దాదాపు అన్ని దేశాల్లోనూ ట్రెండ్ అవుతుంది. ఇక ఐటెం సాంగ్స్ మ్యూజిక్ కంపోజిషన్లో దేవిశ్రీని కొట్టే వారే లేరు. రింగ రింగా, ఆ అంటే అమలాపురం, కెవ్వుకేక, డియాలో డియాలో లాంటి సూపర్ క్రేజీ సాంగ్స్ అన్ని దేవి శ్రీ కంపోజిషన్ లో వచ్చినవే. ఇండియన్ ఐడల్ సీజన్ 2.. ఆహా ఓటీటీలో టెలికాస్ట్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే.. ఈ షో ప్రస్తుతం సూపర్ క్రేజ్ తో కొనసాగుతుంది. ఈ వారం స్పెషల్ గెస్ట్ గా దేవిశ్రీ వచ్చాడు.
షోలో అన్నీ దేవిశ్రీ సాంగ్స్ పాడగా ఒక కంటెస్టెంట్ నేను నేనుగా లేనే.. అనే సాంగ్ పాడి అందరినీ అలరించాడు. దాంతో జడ్జెస్ అందరూ ఆ కంటెస్టెంట్ ను ప్రశంసించగా.. దేవిశ్రీప్రసాద్ ఆ పాట గురించి ఒక సీక్రెట్ రివిల్ చేశాడు. ఈ సాంగ్ మ్యూజిక్ తన మొదటి సినిమా కోసం కంపోజ్ చేశానని.. అయితే ఆ సినిమాలో ఈ ట్యాన్ ఏ పాటకు కంపోజ్ చేయడానికి కుదరలేదని.. దానిని అలా దాచి ఉంచానని తర్వాత వచ్చిన నాగార్జున మన్మధుడు సినిమాలో ఆ సిచ్యువేషన్ కు తగ్గట్టు ఒక పాట చేయాల్సి వచ్చిందట.
అప్పుడు ఈ ట్యూన్ మన్మధుడు డైరెక్టర్ విజయభాస్కర్ కు వినిపించగా ఈ పాటకు ఆ మ్యూజిక్ చాలా బాగా సెట్ అవుతుందని చెప్పారట. అలా నేను నేను గా లేనే సాంగ్ కి తన మొదటి మూవీ కోసం కంపోజ్ చేసిన ట్యూన్ సెట్ చేశానని దేవిశ్రీ చెప్పాడు. అయితే మన్మథుడు సినిమాలో ఆ పాట ఎంత పెద్ద సూపర్ హిట్ అయ్యిందో తెలిసిందే. ఆ మాటకు వస్తే ఆ సినిమాలో అన్నీ పాటలు బాగున్నాయి. ఈ సినిమాతో పాటు పాటలు ఇప్పటకీ అలా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోవడానికి కారణం దేవిశ్రీ ఇచ్చిన సూపర్ మ్యూజిక్ కారణం. దీంతో నాగార్జున ఫ్యాన్స్ నాగార్జున హిట్ సాంగ్ నీ ఫస్ట్ సినిమా కోసం కంపోజ్ చేసిన ట్యూన్ను మార్చేసావా దేవి అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.