టాలీవుడ్ లోనే విలక్షణమైన సినిమాలతో తన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో అడివి శేష్. తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి ఫామ్ లో ఉన్న హీరోగా కొనసాగుతున్నాడు. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ వరస విజయాలను తన ఖాతాలో వేసుకుని కెరీర్ పరంగా జోరు మీద ఉన్నాడు ఈ టాలీవుడ్ హీరో. ఈ హీరో త్వరలోనే అక్కినేని ఇంటికి అల్లుడు కాబోతున్నాడు. అంటే అక్కినేని ఇంటికి అల్లుడుగా వెళుతున్నా ఆమె యార్లగడ్డ సుప్రియకు భర్త కాబోతున్నాడట.
నాగేశ్వరరావు మనవరాలు నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డతో అడివి శేష్ ఏడడుగులు నడవ బోతున్నాడన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ నెల చివరిలోనే వీరి పెళ్లి తేదీ కూడా ఉంటుందని అంటున్నారు. సుప్రియకు ఇంతకుముందే ఓ పెళ్లి జరిగింది.. పవన్ కళ్యాణ్ మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఇష్టం ఫేమ్ చరణ్ రెడ్డిని పెళ్లి చేసుకుంది.
అయితే పెళ్లయిన కొద్ది రోజులకే వీరి మధ్య మనస్పదలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరిదారి వారు చూసుకున్నారు. ఆ తర్వాత చరణ్రెడ్డి అనారోగ్యంతో కొద్ది యేళ్ల క్రిందటే చనిపోయాడు కూడా..! ఇక తర్వాత అడివి శేష్ దర్శకత్వంలో హీరోగా వచ్చిన గూఢచారి సినిమాతో మళ్లీ వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఈ ఇద్దరు ప్రేమలో పడ్డారని.. ఇక ఇప్పుడు వీరి బంధం పెళ్లి వరకు వెళ్లడం దాదాపు కన్ఫార్మ్ అయినట్టే అంటున్నారు.
అంతేకాకుండా ఈనెల 16వ తేదీన వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇప్పుడు ఈ విషయాన్ని ఇటు అడివి శేష్ కానీ, అటు అక్కినేని కుటుంబం గానీ ఎవరు కన్ఫామ్ చేయలేదు..అలాగే ఈ వార్తను ఎవరూ ఖండించనూలేదు. ఇక ఇప్పుడు మరి నిజంగానే ఈ నెలలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారా ? అనేది మాత్రం సస్పెన్స్ గా మారింది. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.