యాంకర్ అనసూయ అంటే తెలియని తెలుగు సినీ ప్రేక్షకుడు ఉండడు. జబర్దస్త్ షో ద్వారా ఎంతో ఫేమస్ అయింది. అదే సమయంలో రంగస్థలం సినిమాలో ఆమె పోషించిన రంగమ్మత్త పాత్ర ఎంతటి సంచలనం క్రియేట్ చేసిందో తెలిసిందే. ఆ తర్వాత అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమాలో దాక్షానిగా నటించిన అనసూయ తన నటనతో పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
దీంతో వరుస సినిమా అవకాశాలు రావడంతో బుల్లితెరకు గుడ్ బై చెప్పి సినిమాల్లో నటించడానికి వెళ్ళిపోయింది. అదే సమయంలో అనసూయ ఎప్పటినుంచి బుల్లి తెరను వదిలిపెట్టిందో అప్పటినుంచి ఆమెకు అనుకొని సమస్యలు ఎదురవుతున్నాయి. అనసూయ అభిమానులు సైతం వెండితెరపై అప్పుడప్పుడు అనసూయని చూస్తున్నాం.. కానీ బుల్లితెరపై ఆమె ఎప్పుడూ కనిపించేది.. ఇప్పుడు ఆమె యాంకరింగ్ మానేయడంతో ఆమె అభిమానులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదే సమయంలో సినిమాలో అప్పుడప్పుడు కనిపించడం కన్నా ప్రతిరోజు బుల్లితెరపై కనిపిస్తేనే అనసూయకు ఎక్కువ పాపులారిటీ ప్రేక్షకుల దగ్గర నుంచి వస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో బుల్లితెరను వదిలేసి వెండితెరపై వరుస సినిమాలో చేయాలనుకుంటున్నా దర్శక నిర్మాతలు అనసూయను అసలు పట్టించుకోవటం లేదు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
జబర్దస్త్ షో చేసినప్పుడు ఆమెకు స్టార్ హీరోయిన్లు మించిన పాపులారిటీ ఉండేది. ఆ పాపులారిటీ తమ సినిమాలకు ఉపయోగపడుతుందని చాలామంది ఆమెను తీసుకునేందుకు ఆసక్తి చూపించేవారు. కానీ ఇప్పుడు జబర్దస్త్ లో ఆమె లేకపోవడంతో సినిమాల్లోనూ తక్కువ అవకాశాలు వస్తున్నాయట. ఇక ఇప్పుడు మిగిలిన హాట్ యాంకర్లు కూడా సినిమాల్లోకి వస్తుండడంతో అనసూయ క్రేజ్ చాలా వరకు తగ్గుతోంది.
ఆమె సినిమాల్లో నటించేందుకు హయ్యస్ట్ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో ఆమెను టాలీవుడ్లో ఇప్పుడు లైట్ తీస్కొంటున్నట్టు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఆయన అనసూయ కెరియర్ ఏ విధంగా కొనసాగుతుందో చూడాలి.