జగపతిబాబు తండ్రిని అక్కినేని నాగేశ్వరరావు ఇంత మోసం చేశారా..? నమ్మించి ముంచేసారా..?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అక్కినేని ఎదగడానికి ఉపయోగపడిన దర్శక నిర్మాతలలో జగపతిబాబు తండ్రి రాజేంద్రప్రసాద్ కూడా ఒకరిని చెప్పాలి. జగపతి ఆర్ట్ పిక్చర్స్ అనే బ్యానర్ ను స్థాపించిన రాజేంద్రప్రసాద్ నిర్మాతగా మారి అక్కినేనితో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. అలా వీరిద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఉండేది. ఈ క్రమంలోనే ఒకసారి అక్కినేని హీరోగా వాణిశ్రీ హీరోయిన్ దసరా బుల్లోడు చిత్రం తీయాలని నిర్మాత రాజేంద్రప్రసాద్ అనుకున్నారు. ఆ సినిమా కోసం అనుకున్న దర్శకుడు వేరే సినిమాతో బిజీగా ఉండడంతో అక్కినేని నాగేశ్వరరావు రాజేంద్రప్రసాద్ నే దర్శకత్వం వహించమని కోరగా… ఇక ఆయన చేసేదేమీ లేక దసరా బుల్లోడు సినిమాకు దర్శక నిర్మాతగా మారి పనిచేశారు.

RGV with Babu after long time « Telugu Movie Database

ఇక ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది. అలా వీరిద్దరి మధ్య బంధం కూడా మరింత బలపడింది. అయితే ఒకానొక సమయంలో అక్కినేనికి రాజేంద్ర ప్రసాద్ కి మధ్య మాటల యుద్ధం జరిగిందట. అసలు విషయంలోకెళితే రాజేంద్రప్రసాద్ దసరా బుల్లోడు సినిమా సమయంలో ఒక హీరోయిన్ తో చాలా క్లోజ్ గా ఉండేవారట. ఆ విషయం చాలా కొద్ది మంది మిత్రులకు మాత్రమే తెలుసు. అయితే ఒకసారి అక్కినేని తన మిత్రులతో ఈ విషయాన్ని చెప్పారట.

Akkineni Nageswara Rao's 95th birth anniversary: Nagarjuna remembers his  legendary father | Telugu Movie News - Times of India

ఈ విషయం కాస్త ఆ నోట ఈ నోట మారి చివరికి రాజేంద్రప్రసాద్ వరకు చేరింది. ఇక మంచి మిత్రుడు అనుకున్న అక్కినేని ఇలా మోసం చేయడంతో కోపంతో ఊగిపోయిన రాజేంద్రప్రసాద్ నేరుగా అక్కినేని దగ్గరకు వెళ్లి తన గురించి అందరి ముందు చెప్పాల్సిన అవసరం ఏముంది అంటూ నిలదీసారట. ఇక తప్పు చేసిన అక్కినేని మౌనంగా ఉండిపోయారని.. అలా రాజేంద్రప్రసాద్ పర్సనల్ లైఫ్ ను తన స్నేహితులతో అక్కినేని బయట చర్చించడంతోనే ఇద్దరికీ గొడవలు వచ్చాయి అని సమాచారం.