ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కీలకమైన నియోజకవర్గం తిరువూరు. ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించిన ఈ నియోజకవర్గంలో రక్షణనిధి వైసీపీ తరఫున వరుస విజయాలు దక్కించుకుంటున్నారు. అయితే.. ఇక్కడ విజయం కోసం .. టీడీపీ కూడా అదే రేంజ్లో ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. గత ఎన్నికల్లో అప్పటి మంత్రి కేఎస్ జవహర్ టీడీపీ తరఫున రంగంలోకి దిగారు.. ఆయన సొంత నియోజకవర్గం కావడంతో గెలుపు గుర్రం ఎక్కుతారని అందరూ అనుకున్నారు. కానీ, వైసీపీ సునామీలో ఆయన విజయం దక్కించుకోలేక పోయారు.
ఇక, ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా టీడీపీ ఇక్కడ ఎవరినీ ఇంచార్జ్గా నియమించలేదు. ఒకవేళ నియమించినా.. సహకరించే నాయకులు మాత్రం కనిపించడం లేదని.. పెద్ద ఎత్తున పార్టీలోనే చర్చసాగుతోంది. మరి టీడీపీ ఎలా గెలుస్తుంది? అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న. దీనికి వైసీపీనే కారణమని అంటున్నారుపరిశీలకులు. క్షేత్రస్థాయిలో తిరువూరు నియోజకవర్గం రాజకీయాలను పరిశీలిస్తున్నవారు.. వైసీపీ ఎమ్మెల్యే రక్షణనిధిపై ఇక్కడి ప్రజలకు వ్యతిరేకత జోరుగా పెరిగిందని అంటున్నారు.
అంతేకాదు.. రక్షణ నిధి కుటుంబంలోనే పలువురు గ్రూపులుగా ఏర్పడి.. రాజకీయాలు చేస్తున్నారని చెబుతున్నారు. రక్షణనిధి సోదరుడు, బావ, బావమరిది.. ఇలా నియోజకవర్గాన్ని తలోమూల పంచుకున్నారనేది రాజకీయ విశ్లేషకుల మాట. అంతేకాదు.. నియోజకవర్గంలో నాలుగేళ్లు గడిచినా.. ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదేని ప్రజలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. ఇటీవల తిరువూరులో సీఎం జగన్ పాల్గొన్న సభలో ఎమ్మెల్యేరక్షణ నిధి నిధుల కోసం ఏకరువు పెట్టారు.పెండింగు పనులను ఆయన సీఎం కు వివరించారు. మరి ఈ నాలుగు సంవత్సరాలు ఆయన ఏం చేసినట్టు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అంతేకాదు. ఆయన అసలు నియోజకవర్గాన్ని పట్టించుకుంటున్నారా? అనేది ప్రశ్న. ఇదే ఇప్పుడు రక్షణ నిధికి ఇరకా టంగా మారింది.
టీడీపీ ఎలా గెలుస్తుందంటే!
తెలుగు దేశం పార్టీ తిరువూరులో ఎలా గెలుస్తుందనేది కూడా ఆసక్తిగా మారింది. అయితే.. వైసీపీపై ఉన్న తీవ్రమైన వ్యతిరేకత ఇక్కడ టీడీపీకి కలిసి వస్తుందని పరిశీలకులు చెబుతున్నారు. ఆయన వ్యతిరేకతే.. టీడీపీకి వరంగా మారుతుందని అంటున్నారు. సో.. ఎవరిని నిలబెట్టినా.. భారీ మెజారిటీతో గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమని చెబుతున్నారు. అభ్యర్థులతోనూ పనిలేదని.. కేవలం ప్రజలు మార్పు కొంటున్నారని చెబుతున్నారు. సో.. ఈ ఒక్క కారణమే టీడీపీకి ప్లస్గా మారిందని అంటున్నారు.